తాగొచ్చిన పెళ్లికొడుకు..అమ్మాయి ఏంచేసిందంటే?
కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా టిక్రీ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది....
ప్రయాగ్రాజ్: కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా టిక్రీ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. రవీంద్రపటేల్ అనే అబ్బాయికి, టిక్రీలో ఓ సాధారణ రైతు కూతురికి వివాహం కుదిరింది. మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికొడుకు తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగేసి వచ్చాడు. అంతటితో ఆగకుండా తనతో డ్యాన్స్ చేయాలని అమ్మాయిని బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో అమ్మాయి మమ్మల్ని అవమానిస్తోందంటూ పెళ్లికొడుకు రాద్దాంతం చేయడం ప్రారంభించాడు. దీనికి ఆయన కుటుంబ సభ్యులు కూడా తోడవ్వడంతో వివాదం కాస్తా పెద్దదయ్యింది. అబ్బాయి ప్రవర్తనతో విసుగెత్తిన అమ్మాయి పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే వివాహం నిశ్చయమైన సమయంలో ఇచ్చిన బహుమతులను తిరిగివ్వాలని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులను యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంలో పెళ్లికొడుకు కుటుంబసభ్యులందరినీ కాసేపు ఇంట్లోనే బంధించారు.
ఈ విషయం పోలీసుల వరకు చేరింది. వారు అమ్మాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆమె ససేమిరా అంది. దీంతో చేసేది లేక అబ్బాయి కుటుంబ సభ్యులు తీసుకున్న బహుమతులను తిరిగి ఇచ్చేయడానికి అంగీకరించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. వివాహం మాత్రం జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్