Mekapati Goutham Reddy: జిమ్‌కు వెళ్దామని సిద్ధమై.. అంతలోనే!

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. కాగా, ఈ ఉదయం 7.30 గంటల సమయంలో

Updated : 21 Feb 2022 11:38 IST

హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. కాగా, ఈ ఉదయం 7.30 గంటల సమయంలో గౌతమ్‌రెడ్డి జిమ్‌కు వెళ్దామని సిద్ధమైనట్లు ఆయన ఇంటి కాపలాదారు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు రాకముందే ఛాతీలో నొప్పి అంటూ ఆయన సోఫాలో కూర్చున్నారని చెప్పారు. దీంతో వెంటనే గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు కాపలాదారు వివరించారు. గౌతమ్‌రెడ్డిని ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆయన శ్వాస ఆడట్లేదని అపోలో వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని అపోలో వైద్యులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని