Microplastics: రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్ జాడలు..!
పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరిపోతున్నట్లు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు.
తొలిసారిగా గుర్తించిన నెదర్లాండ్ శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న ప్లాస్టిక్ వ్యర్థ్యాలు మానవాళికి పెను ముప్పుగా మారుతోన్న సంగతి తెలిసిందే. హిమాలయాలు మొదలు మహాసముద్రాల్లోనూ పెరిగిపోతోన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావాలు కలిగించనున్నాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరిపోతున్నట్లు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. పరిశోధన జరిపిన 80శాతం మంది రక్త నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇలా రక్తంలో కలిసే ప్లాస్టిక్ కణాలు మానవ శరీరం మొత్తం ప్రయాణిస్తూ వివిధ అవయవాల్లో తిష్ట వేసే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు.
తక్కువ స్థాయిలోనే అయినా..
అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్.. ఆహారం, నీరు, శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజూవారీగా వినియోగించే వాటర్ బాటిళ్లు, ఆహార ప్యాకింగ్లో వాడే ప్లాస్టిక్, ప్లాస్టిక్ కప్పులతో స్వల్ప పరిమాణంలో ఉన్న మైక్రోప్లాస్టిక్ (ఒక అంగుళంలో 0.2కంటే తక్కువ వ్యాసం కలిగిన) శరీరంలోనే తేలికగా చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి కణాలు రక్తంలో ఏమేరకు చేరుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 22 మంది ఆరోగ్యకరమైన దాతల రక్తనమూనాలను పరీక్షించారు. వారిలో 17 మంది రక్తంలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా బాటిళ్లను తయారు చేసేందుకు వాడే పీఈటీ (Polyethylene Terephthalate) ప్లాస్టిక్ సగానికిపైగా ఉండగా.. ఆహార పదార్థాల ప్యాకింగ్లో వినియోగించే పాలిస్టిరీన్ స్థాయిలు 36శాతంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, ప్రతిమిల్లీ లీటర్ రక్తంలో 1.6 మైక్రోగ్రాముల కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఇవి కూడా ఆందోళన కలిగించే విషయమేనని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.
బ్రేక్త్రూ ఫలితం..
‘ప్రత్యేకమైన రసాయన పదార్థాలతో కూడిన పాలిమర్లు రక్తంలో ఉన్నాయన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇది అత్యంత ముఖ్యమైన ఫలితం’ అని నెదర్లాండ్లోని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్కు చెందిన ప్రొఫెసర్ డిక్ వెతాక్ పేర్కొన్నారు. అయితే, ఈ పాలిమర్స్ను విశ్లేషించేందుకు నమూనాల సంఖ్య మరింత పెంచి విస్తృత పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని డిక్ వెతాక్ చెప్పారు.
మానవ కణాలకు హాని..
రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు వల్ల మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపిస్తాయనే విషయంపై ఇప్పటివరకు సమాచారం లేదు. అయినప్పటికీ ఈ మైక్రోప్లాస్టిక్లు మానవ కణాలకు హాని కలిగిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా శిశువులు, చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉందన్నారు. ఇదివరకు వచ్చిన అధ్యయనాల ప్రకారం, మెదడు, పుట్టబోయే బిడ్డల ఆంత్రమూలము, పోషణావయవాల్లో ఈ మైక్రోప్లాస్టిక్లను ఇప్పటికే గుర్తించినప్పటికీ రక్తంలో వీటి జాడలు కనుక్కోవడం ఇదే తొలిసారి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల శరీరంలోకి చేరే కణాల కారణంగా ప్రతిఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత