Harishrao: పైరవీలకు రావొద్దు.. 2-3 ఏళ్లు పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేయాలి: హరీశ్రావు
రాష్ట్రంలో వైద్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కొత్తగా నియమితులైన వైద్యుల పరిచయ కార్యక్రమంలో 929 మందికి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం బలోపేతం కావడమే కాకుండా దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న శిల్ప కళా వేదికలో కొత్తగా నియమితులైన వైద్యుల పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 929 మంది వైద్యులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. వైద్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇంత మందికి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటిసారని చెప్పారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు స్వాగతం పలికారు. సమాజ సేవకు వైద్యులను పంపినందుకు తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు తెలియజేశారు. తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తారని.. ప్రాణం పోసే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని హరీశ్రావు అన్నారు. కొవిడ్ సమయంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో పని చేసిన వారికి వెయిటేజీ కల్పించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు పీజీలో కూడా వెయిటేజీ కల్పించామన్నారు. దయచేసి వైద్యులు బదిలీల కోసం పైరవీలకు రావొద్దని, కనీసం రెండు మూడేళ్లు పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేయాలని చెప్పారు. బాగా పనిచేసి పేదలకు సేవలందిస్తే కౌన్సిలింగ్లో వెయిటేజీ కల్పిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!