ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: వైకాపా 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైకాపా సంఘీభావం తెలిపింది. ఇవాళ విశాఖలో కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి..

Updated : 14 Jul 2021 14:25 IST

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైకాపా సంఘీభావం తెలిపింది. ఇవాళ విశాఖలో కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చించారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపించి అమ్మెస్తామనడాన్ని వ్యతిరేకిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

‘‘స్టీల్‌ ప్లాంట్‌ కోసం సొంత గనులు ఇవ్వాలి. గనులు బయటి నుంచి ఇవ్వక్కర్లేదు. మన రాష్ట్ర సరిహద్దు కోటియాలో గనులు ఉన్నాయి. దీనిపై ఉక్కు శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిని కలుస్తాం. భాజపాయేతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఒప్పుకోమని ముత్తంశెట్టి స్పష్టం చేశారు. కేంద్రం ఇలా జాతీయ సంపదను విక్రయించడం సరికాదన్నారు. నష్టాన్ని భర్తీ అయ్యేలా కేంద్రం సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని