Telangana News: వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలి: నిరంజన్రెడ్డి
దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో నిర్వహించిన వర్క్షాప్లో నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
నల్గొండ: దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో నిర్వహించిన వర్క్షాప్లో నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పారు. ప్రజల జీవన విధానంలో, ఆహారంలో అనేక మార్పులొచ్చాయని.. వాటికి అనుగుణంగా రైతులు తృణధాన్యాలు, ఉద్యాన పంటల సాగు వైపు వెళ్లాలన్నారు.
‘‘ప్రస్తుతం నూనె గింజల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నూనె గింజల సాగు పెరగాలి. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాం. ఆయిల్ పామ్లో 168 రకాల ఉప ఉత్పత్తులు ఉంటాయి. ఇండోనేషియా, మలేషియాలో ఆయిల్పామ్ సాగుతో మంచి ఆదాయం వస్తోంది. తెలంగాణలో వ్యవసాయానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి. రైతులు భిన్నమైన పంటలు వేసే విధంగా ప్రణాళికలు వేయాలి’’ అని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో