ఆ గ్రామమంతా మినీ గ్రంథాలయాలే..!
సాధారణంగా ఏ గ్రామంలోనైనా ముఖ్యమైన వీధుల్లో వివిధ దుకాణాలు, క్లినిక్స్, టిఫిన్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేరళలోని పెరుంకులం గ్రామంలోని జంక్షన్ల వద్ద బుల్లి బుల్లి గ్రంథాలయాలు దర్శనిమిస్తాయి. పుస్తకాలు చదువుకుంటూ.. పుస్తకం తీసుకొని మరో పుస్తకం
సాధారణంగా ఏ గ్రామంలోనైనా ముఖ్యమైన వీధుల్లో వివిధ దుకాణాలు, క్లినిక్స్, టిఫిన్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేరళలోని పెరుంకులం గ్రామంలోని జంక్షన్ల వద్ద బుల్లి బుల్లి గ్రంథాలయాలు దర్శనిమిస్తాయి. పుస్తకాలు చదువుకుంటూ.. పుస్తకం తీసుకొని మరో పుస్తకం అందులో పెడుతున్న ప్రజలు కనిపిస్తారు. అందుకే ఈ గ్రామం కేరళలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు ఊరికే రాలేదు. దాని వెనక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది.
1948 జనవరి 30న మహాత్మగాంధీ హత్యకు గురయ్యారు. దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. అందరూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. కానీ అదే సమయంలో పెరుంకులం గ్రామంలోని కొందరు యువకులు గాంధీ మృతికి సంతాపంగా గుర్తిండి పోయేలా ఏదైనా చేయాలనుకున్నారు. గాంధీకి పుస్తక పఠనమంటే ఎంతో ఇష్టం. అందుకే ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా పిల్లై అనే యువకుడు మరికొందరు కలిసి వంద పుస్తకాలను సేకరించి పిల్లైకి చెందిన ఇంట్లోనే ఓ గదిని గ్రంథాలయంగా మార్చేశారు. దానికి బాపూజీ స్మారక వయనశాల (బాపూజీ మెమోరియల్ లైబ్రరీ) అని పేరుపెట్టారు. మొదట్లో ఈ గ్రంథాలయం బాగానే నడిచింది. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం, సొంతంగా పుస్తకాలు ముద్రించడం వంటివి జరిగాయి. ఆ తర్వాత నిర్వహణ లోపంతో కొన్నాళ్లు మూతపడి, గ్రంథాలయ గదిని మార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు 2016 ఫిబ్రవరిలో ఈ బాపూజీ స్మారక వయనశాల కోసం కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలతో సొంత భవనం ఏర్పాటైంది.
2017లో పెరుంకులం గ్రామ ప్రజలు ఈ గ్రంథాలయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని భావించారు. ఇందుకోసం గ్రామంలోని ముఖ్య జంక్షన్లో చిన్న గ్రంథాలయం పెట్టారు. దానికి మంచి స్పందన రావడంతో గ్రామంలోని ప్రతి జంక్షన్లో ఓ బుల్లి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 50 పుస్తకాలు ఉంటాయి. గ్రామంలో ఎవరైనా సరే ఉచితంగానే పుస్తకాలను తీసుకొని అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. లేదా ఒక పుస్తకం ఇంటికి తీసుకెళ్లాలంటే మరో పుస్తకాన్ని అక్కడ పెట్టాలి. అలా పుస్తకాలను ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ ఎన్ని పుస్తకాలైనా తీసుకోవచ్చు. పిల్లలకు చదువుపై ఇష్టం కలిగించేలా చిన్నారులకు సంబంధించిన అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దీంతో 2019 జూన్లో రాష్ట్రంలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా పెరుంకులం గుర్తింపు పొందింది. బుల్లి గ్రంథాలయాలకు, బాపూజీ స్మారక వయనశాలకు కేరళ రాష్ట్ర గ్రంథాలయ మండలి నుంచి నిధులు కూడా వస్తున్నాయి.
నిజానికి పెరుంకులం గ్రామం కంటే ముందు మహారాష్ట్ర సతారా జిల్లాలోని బిలార్ గ్రామంలో బుల్లి గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. దీంతో భారత్లోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా బిలార్ నిలిచింది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బాపూజీ స్మారక వయనశాల సిబ్బంది పెరుంకులం గ్రామంలోనూ బుల్లి గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. అలా పెరుంకులం కేరళలో తొలి.. దేశంలో రెండో ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..