Mann ki Baat: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంసలు

తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ ప్రధాని నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

Updated : 25 Jul 2021 14:54 IST

తిరుపతి: తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ ప్రధాని నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.  సాయి ‘ఏపీ వెదర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా  అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు. సాయి ప్రణీత్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని