Andhra News: ఏపీలో స్టేట్‌ డేటా సెంటర్‌ సర్వర్‌ డౌన్‌.. నిలిచిన ఐటీ సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌ డౌన్‌ అయింది. ఎస్‌డీసీ సర్వర్‌ డౌన్‌ అవడంతో ఏపీ వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.

Published : 14 Mar 2023 11:13 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌ డౌన్‌ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌డౌన్‌తో ఉద్యోగుల అటెండెన్స్‌ యాప్‌, ఇతర వెబ్‌ ఆధారిత సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పౌర సేవలకూ అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్‌లో సర్వర్‌ ఎందుకు డౌన్‌ అయిందనే విషయంపై వివరాలు తెలియరాలేదు. ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని