ఒంటిమిట్ట రాముణ్ని దర్శించుకున్న ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముణ్ని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న ఆయన తెల్లవారుజామున అభిషేక పూజల్లో పాల్గొని స్వామివారికి వస్త్రాలు

Published : 30 Jan 2021 08:03 IST

ఒంటిమిట్ట: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముణ్ని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న ఆయన తెల్లవారుజామున అభిషేక పూజల్లో పాల్గొని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. పండితులు ఆలయ విశిష్టతను ఎస్‌ఈసీకి వివరించారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఉదయం 9 గంటలకు కడప చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహిస్తారు. 

 

ఇవీ చదవండి..
సజ్జలను తొలగించండి


ఏకగ్రీవాలకూ పద్ధతులుంటాయి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని