అయోధ్యలో భూమిపూజ... దేశవ్యాప్తంగా సంబరాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది......

Updated : 05 Aug 2020 18:31 IST

దిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. రామమందిరం నిర్మాణానికి పునాది పడటంతో దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. దిల్లీలో పలువురు కాషాయ జెండాలు చేతబూని వీధుల్లో ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. రంగులు పూసుకుని బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇవీ... 

దిల్లీలోని విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యాలయం వద్ద నృత్యాలు చేస్తున్న మహిళలు


 

 

 

వాయిద్యాలతో నృత్యాలు చేస్తున్న మహిళలు


వర్షంలో నృత్యాలు చేస్తున్న మహిళలు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని