Supreme court: ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయండి: సుప్రీంకోర్టు
ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దిల్లీ: ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్.ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్ఫర్ పిటిషన్పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.
ఒకే రకమైన అంశంపై పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈలోగా మరికొన్ని కేసులు పెట్టి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారు. ఒక కేసులో సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ జరపాలని ఆదేశించింది. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్లో జరిగినట్టు ఉన్నందున అన్ని కేసుల విచారణ ఒకే చోట జరగాలి’’ అని లూథ్రా వాదించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?