Mannam Venkataramana: ఎన్నారై మన్నం వెంకటరమణ కన్నుమూత

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై మన్నం వెంకటరమణ కన్నుమూశారు. 

Updated : 22 Feb 2024 02:50 IST

టంగుటూరు: ప్రవాస భారతీయుడు మన్నం వెంకటరమణ కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. వెంకటరమణ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కాకటూరువారి పాలెం. అమెరికాలో స్థిరపడిన ఆయన ఎంతోమంది తెలుగు విద్యార్థులకు అక్కడ ఉద్యోగాలు సాధించేందుకు సహాయపడ్డారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు. వారం రోజుల క్రితం అమెరికా నుంచి ఇండియాకు విమానంలో బయలుదేరగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది గ్రీస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కాకటూరివారి పాలెంలోని ఆయన బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని