Telangana Cabinet: ఈనెల 16 నుంచి దళితబంధు అమలు: సీఎం కేసీఆర్
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్ ఇవ్వాలని...
హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంటుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ను బదిలీ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. దళితబంధు పథకం పూర్వాపరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం కేసీఆర్ విశదీకరించారు. అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
లబ్ధిదారులు కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి..
వినూత్న పంథాలో.. లబ్ధిదారులు కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళితబంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టంచేశారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు పది రోజుల్లోనే ప్రతిఫలం పొందేలా యూనిట్లకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అమలు చేస్తున్నవాటిలో రెండు, మూడు యూనిట్లను కలిపి ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతోంది. ఒక యూనిట్కు అనుమతిస్తే ఇతరులపై ఆధారపడకుండా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన యంత్రాలు, వాహనాలు సమకూర్చనుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు పెట్టుబడి సహాయం చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రాంతాలకు తగినట్లు 47 పథకాలు రూపొందించింది. చిన్న, చిన్న యూనిట్లు కాకుండా ఒక యూనిట్ను ప్రారంభిస్తే కనిష్ఠంగా పది రోజులు, గరిష్ఠంగా నెల రోజుల్లో మంచి ప్రతిఫలం దక్కేలా సిద్ధం చేయాలని ఇటీవల దళిత సాధికారత అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!