Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 400 కొవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య...

Published : 24 Oct 2021 18:37 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,343కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 516 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,44,132 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5,102 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తురు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని