Ramineni Foundation: పలువురు ప్రముఖులకురామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదానం
విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు డాక్టర్ రామినేని ఫౌండేషన్-యూఎస్ఏ ఆధ్వర్యంలో...
హైదరాబాద్: విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు డాక్టర్ రామినేని ఫౌండేషన్-యూఎస్ఏ ఆధ్వర్యంలో ఏటా అందించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం గచ్చిబౌలిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగువారి గొప్పతనంపై గర్వించాల్సిన సమయమిది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి విశిష్ఠ, విశేష పురస్కారాలను ప్రదానం చేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి విశిష్ఠ పురస్కారాలను భారత్ బయోటెక్ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణ ఎల్ల, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లకు ప్రదానం చేశారు. 2021కి సంబంధించి విశేష పురస్కారాలను ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గా పద్మజ, సినీ జర్నలిస్టు ఎస్.వి. రామారావుకు ప్రదానం చేశారు. ఇక 2020 ఏడాదికి సంబంధించి విశిష్ఠ పురస్కారాన్ని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజుకు అందించారు. 2020కి సంబంధించి విశేష పురస్కరాలను యాంకర్ సుమ, డాక్టర్ మస్తాన్ యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు