Telangana schools reopen: తెలంగాణలో తెరుచుకున్న విద్యాసంస్థలు
తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో
జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే: ఇంటర్బోర్డు
హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురుకులాలు మినహా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే జరుగుతుందని ఇంటర్ బోర్టు ప్రకటించింది.
పాఠశాలలను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి
పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేర్వేరుగా సందర్శించారు. రాజ్భవన్ పాఠశాలను గవర్నర్ సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాఠశాలలను అధికారులు శుభ్రం చేయించారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు నా అభినందనలు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి’’ అని గవర్నర్ సూచించారు.
పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేజీ టూ పీజీ 30-40 శాతం విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారన్నారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, గ్రామాల్లో గ్రామ పంచాయతీ, పట్టణాల్లో మున్సిపాలిటీలు తాగునీరు, టాయిలెట్ల సౌకర్యాలను కల్పిస్తున్నాయని చెప్పారు. జులై నుంచి ఇప్పటి వరకు 1.20లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. రెసిడెన్షియల్ మినహాయించి ప్రత్యక్ష బోధన చేయాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం సమయంలో కచ్చితంగా విద్యార్థుల వెన్నంటే ఉండి చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని పాఠశాలల సిబ్బందికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం