AP News: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్ష బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లోని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్.. నెల్లూరు, చిత్తూర...
ఇంటర్నెట్డెస్క్: ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లోని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలో పాపవినాశనం, శ్రీవారి పాదల దారిని తితిదే మూసివేసింది. పలు చోట్ల వృక్షాలు నేలకూలి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు నగరం జలమయం...
భారీ వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. ప్రధాన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకమేర్పడుతోంది. బుజబుజ నెల్లూరు, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. గాలుల వేగం పెరగడంతో చలితీవ్రత ఎక్కువైంది. గంట గంటకూ గాలుల తీవ్రత పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాలోని 12 మండలాల్లో దాదాపు 3,219 ఎకరాల్లో వరి పంట నీటిమునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అచనా వేశారు. తడ, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, నాయుడు పేట ప్రాంతాల్లో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కడపలో మోస్తరు నుంచి భారీ వర్షం..
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఉదయం నుంచి కడపలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో కడప జిల్లా పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గవంకకు ఇరువైపులా ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో వాగులు, వంకలు ఉన్నచోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ప్రవహించే చోట ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యుత్సాహం చూపి వాగులు, వంకల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో మాహా పాదయాత్రకు ఆటంకం..
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో కురిసిన వర్షం అమరావతి మహాపాదయాత్ర నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసింది. నాగులుప్పలపాడులో బసచేసిన రైతుల శిబిరంలో టెంట్లు వర్షానికి తడిసిపోయాయి. భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
తిరుమలలో నేలకూలిన వృక్షాలు..
భారీ వర్షాల కారణంగా తిరుమలలో పాపవినాశనం, శ్రీవారి పాదల దారిని తితిదే మూసివేసింది. వేకువజాము నుంచి భారీ గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో చెట్లు నేలకూలుతున్నాయి. తిరుమలలోని పలు ప్రాంతాలతో పాటు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఈరెండు సందర్శనీయ ప్రాంతాలకు భక్తుల అనుమతిని నిలిపివేశారు. కూలిన వృక్షాలను తొలగించేందుకు అటవీ విభాగం సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రెండో కనుమదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భక్తులందరూ కలిసి చెట్టును పక్కకు లాగడంతో వాహనాలు ముందుకు సాగాయి. అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద భారీ వృక్షం దుకాణాలపై పడింది. చెట్లు పడే పరిస్థితిని గమనించిన దుకాణదారులు పక్కకు వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. భారీగా వీస్తున్న గాలులకు పలు దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఉప్పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది..
చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు గంగాధర నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలిలో వర్షపునీరు భారీగా చేరింది. ఫలితంగా అన్నమయ్య కూడలి, ఎమ్మార్పల్లి ప్రాంతాలకు చేరుకోవాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి, మామిడిమానుగడ్డ, కొటాల, పులిత్తివారిపల్లెలో రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో ఏర్పేడు మండలంలోని సదాశివపురం-ఏర్పేడు ప్రధాన రహదారిపై మోదుగుల పాలెం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తోంది. పాపానాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై సీతకాలువలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు. కల్యాణి డ్యామ్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరో పది అడుగుల నీరు చేరితే గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!