ICMR sero survey: పిల్లల్లో 55%.. పెద్దల్లో 61% కొవిడ్ యాంటీబాడీలు
తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది..
హైదరాబాద్: తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సీరో సర్వేలో 60 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు గుర్తించినట్లు తెలిపింది. వారిలో 55 శాతం పిల్లలు, 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు గుర్తించామని పేర్కొంది. అలాగే 82.4 శాతం మంది హెల్త్కేర్ వర్కర్లలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపింది. తొలి విడతలో 0.33 శాతం, రెండో విడతలో 12.5 శాతం, మూడో విడతలో 24.1 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు ఎన్ఐఎన్ వెల్లడించింది. జాతీయ స్థాయిలో గత ఏడాది 24 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలను గుర్తించగా.. ప్రస్తుతం అది 67 శాతానికి చేరింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో 94 శాతం సీరో పాజిటివిటీ రేట్ ఉన్నట్లు ప్రకటించింది.
తద్వారా కరోనా వ్యాక్సిన్లు సమర్ధంగా పనిచేస్తున్నాయనే విషయం స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జూన్ నెలలో చేపట్టిన సర్వేను అన్ని వయసుల వారిపై చేపట్టగా.. ఈసారి 6-9 ఏళ్ల వయసున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దాదాపు 55శాతం పిల్లల్లో (6 నుంచి 9ఏళ్ల) సీరో పాజిటివ్గా తేలగా.. యుక్త వయసు పిల్లల్లో 61 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందుగానే వ్యాక్సిన్లు అందించడం వల్ల వారిలో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు నిపుణులు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?