Crime: వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం

గ్రేటర్‌ నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు.

Published : 07 May 2024 16:38 IST

దిల్లీ: నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్‌ వాటర్‌ ట్యాంక్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో యూనివర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల వివరాల మేరకు... మృతురాలు తన భర్త, అత్తతో కలిసి అదే విశ్వవిద్యాలయంలో నివసించేది. యూనివర్సిటీ సమీపంలోని జిమ్స్‌ ఆసుపత్రిలో భార్యాభర్తలు పని చేస్తుండేవారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవే మహిళ హత్యకు దారితీసి ఉండొచ్చని, ఆమెను హత్య చేసి వాటర్‌ట్యాంక్‌లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త, అత్త పరారీలో ఉన్నారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని  శవపరీక్షకు తరలించినట్లుగా సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని