KRMB: హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ భేటీ

నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో

Updated : 01 Sep 2021 15:49 IST

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో ప్రధానంగా 13 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. వీటితో పాటు శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి, గోదావరి జలాల మళ్లింపు, చిన్న నీటి వనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణ, ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులపై ఈ భేటీలో చర్చించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని