TS News: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది.

Published : 28 Aug 2021 13:20 IST

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 4న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్‌తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరుసలేం, వేం కృష్ణ కీర్తన్‌లు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని