Travel influencer: ఏడాది చిన్నోడు.. ఎంచక్కా తిరిగి సంపాదిస్తున్నాడు!
ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.. ముద్దుముద్దు మాటలు చెప్తున్నాడు.. అయితేనేం, ఆ తప్పటడుగులు, ముద్దు మాటలతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ చిన్నోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
వాషింగ్టన్: ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.. ముద్దుముద్దు మాటలు చెప్తున్నాడు.. అయితేనేం, ఆ తప్పటడుగులు, ముద్దు మాటలతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ చిన్నోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
2020 అక్టోబర్ 14న జన్మించిన ఆ బుడతడి పేరు బ్రిగ్స్. పుట్టిన మూడు వారాలకే తొలి విహార యాత్ర మొదలుపెట్టేశాడు. ఈ ఏడాదిలో 45 సార్లు విమానం ఎక్కి, అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు. అలాస్కాలో ఎలుగుబంట్లు, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో తోడేళ్లు, కాలిఫోర్నియాలోని బీచ్లు.. తను వెళ్లిన ప్రతి రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలను ఆస్వాదించాడు. జలపాతాల వద్ద జలకాలాడాడు. నదుల్లో ప్రయాణించాడు. ఈ విషయాలన్నింటినీ whereisbriggs అనే ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకొని పాపులరయ్యాడు. బ్రిగ్స్ ఖాతాను ప్రస్తుతం 30 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. అతి పిన్నవయస్కుడైన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన ఈ చిన్నారి నెలకు వెయి డాలర్లు (సుమారు 75 వేలు)సంపాదిస్తున్నాడు!
అసలు ఈ పర్యటనలు చేయాలన్న ఆలోచన బ్రిగ్స్ వాళ్ల అమ్మ జెస్ది. ఆమె పార్ట్ టైమ్ టూరిస్ట్స్ అనే బ్లాగ్ నడిపేది. ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఆమెకు బ్లాగ్ ద్వారా కొంత మొత్తం అందుతుంది. ‘నేను 2020లో గర్భం దాల్చినప్పుడు, ఇక నా కెరీర్ ముగిసిపోయిందని చాలా ఆందోళన చెందాను. చిన్నపిల్లలతో నా వృత్తిలో కొనసాగడం సాధ్యమా అనే ఆలోచనే అందుకు కారణం’ అని జెస్ మీడియాకు వెల్లడించారు. ‘అయితే నా భర్త, నేను ఎలాగైనా మా ట్రావెలింగ్ను కొనసాగించాలనుకున్నాం. బేబీ ట్రావెల్పై ఉన్న సోషల్ మీడియా ఖాతాల గురించి వెతికాం. అయితే నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ పనేదో నేను చేయాలనుకున్నా. అది సరదాగా, అకట్టుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నా. అలాగే మొదటిసారి చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలనుకున్నా’ అంటూ ఆమె వివరించారు. అక్కడి నుంచే whereisbriggs పుట్టుకొచ్చిందన్నారు.
కొవిడ్ సమయంలో కూడా వీరి ప్రయాణం కొనసాగింది. ఎక్కువ రద్దీ లేని ప్రాంతాలను చూసుకొని, నిబంధనలు పాటిస్తూ వారు ముందుకెళ్లారు. ఇప్పుడు వారు యూరప్ ట్రిప్ ప్లాన్చేస్తున్నారు. మరోవిషయం ఏంటంటే.. ఈ బేబీ బ్రిగ్స్కు స్పాన్సర్ కూడా ఉన్నారు. ఈ చిన్నారికి డైపర్లు, వైప్స్ అందిస్తారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత