Ukraine Crisis: రుమేనియాకు చేరుకున్న ఏపీ విద్యార్థులు.. కాసేపట్లో దిల్లీకి పయనం
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రుమేనియాకు చేరుకున్న తెలుగు...
అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రుమేనియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరనున్నారు. తల్లిదండ్రులతో వీడియోకాల్లో మాట్లాడిన కృష్ణా జిల్లా కౌతవరానికి చెందిన అనూష ఈ విషయం వెల్లడించారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా హెల్ప్ చేస్తున్నాయని వివరించారు. తనతో పాటు మరో 8 మంది విద్యార్థులు విమానంలో భారత్కు వస్తున్నట్టు చెప్పారు. ‘‘తెలుగు విద్యార్థులు స్వదేశానికి వచ్చేయాలంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు కోరారు. మాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఇప్పటికీ ఉక్రెయిన్లో పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయి. మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నా’’ అని అనూష విజ్ఞప్తి చేశారు. హంగేరిలోని బుడాపెస్ట్ నుంచి మరో విమానం దిల్లీకి బయల్దేరింది. ఇందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ విమానం రేపు ఉదయం దిల్లీకి చేరుకోనుంది.
ఏ క్షణం ఏం జరుగుతుందో భయంగా ఉంది..
విన్నిస్తియా సిటీలోని అపార్టమెంట్ హాస్టల్లో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వినోద్ తెలిపారు. ‘‘ ఇక్కడ ప్రతి ఒక్క ఉక్రేనియన్కి తుపాకులు ఇచ్చారు. పోలండ్, రుమేనియా బోర్డర్కి రానివ్వడం లేదు. బోర్డర్ వద్దకు వెళ్లిన కొందరు అక్కడే ఉండిపోయారు. ఎంబసీ అధికారులు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెబుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది’’ అని వినోద్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక