Palnadu: మృతదేహంతో ధర్నా.. వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated : 28 Jan 2024 20:28 IST

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేధింపుల కారణంగా మండలంలోని బంగారుపెంట గ్రామానికి చెందిన మత్స్యకారుడు దుర్గారావు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశంపార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులు భారీగా చేరుకోవడంతో స్టేషన్‌ వైపు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు