AP Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా సుమారు 5వేల కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.

Published : 07 Jun 2021 17:23 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా సుమారు 5వేల కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 64,800 శాంపిల్స్‌ పరీక్షించగా, 4,872 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.98కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించారు. తాజాగా 13,702మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 86మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరులో 13మంది చనిపోగా, గుంటూరు 10,  అనంతపురం 9, శ్రీకాకుళం 9, విజయనగరం 7, పశ్చిమగోదావరి 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరులో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో 11,552మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని