AP Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా సుమారు 5వేల కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్లో తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా సుమారు 5వేల కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. గత 24 గంటల్లో 64,800 శాంపిల్స్ పరీక్షించగా, 4,872 మంది కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.98కోట్ల శాంపిల్స్ను పరీక్షించారు. తాజాగా 13,702మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 86మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరులో 13మంది చనిపోగా, గుంటూరు 10, అనంతపురం 9, శ్రీకాకుళం 9, విజయనగరం 7, పశ్చిమగోదావరి 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరులో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో 11,552మంది మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత ఓటింగ్లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్ ఉపాధ్యాయ
విద్యా వంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.