TS News: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి

రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 17 Dec 2023 16:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.
  • విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి.
  • వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా
  • ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజును నియమించారు.
  • జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు.
  • వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి.
  • నల్గొండ కలెక్టర్‌  ఆర్‌.వి.కర్ణన్‌ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌.వి.కర్ణన్‌ను నియమించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని