TS news: తెలంగాణ గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి బదిలీ

తెలంగాణ గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ బదిలీ అయ్యారు. 

Published : 16 Mar 2024 22:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆయనను ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ సీఎస్‌ శాంతికుమారి జీవో జారీ చేశారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతరావుకు దేవాదాయశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో నియమించింది. సీసీఎల్‌ఏ కార్యదర్శి కె.గంగాధర్‌ను బదిలీ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని