తెలంగాణలో 500కు చేరువలో కొవిడ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో

Updated : 25 Mar 2021 09:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 56,464 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 493 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,791కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,684 ఉండగా.. వీరిలో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 138 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 98,45,577కి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని