Telangana News: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన... రంగంలోకి మంత్రి హరీశ్రావు
సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. చిన్న కోడూరు
చిన్న కోడూరు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. చిన్న కోడూరు మండలం మెట్టు బండల వద్ద కాంగ్రెస్ నేతలు, నిర్వాసితులతో గంట పాటు చర్చలు జరిపారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కోదండరెడ్డి, కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి సరికాదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మేజర్లకు ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్కు మంత్రి హరీశ్రావు అంగీకరించలేదని నిర్వాసితులు తెలిపారు. మొదట గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆలోచిస్తానని మంత్రి చెప్పారని వివరించారు. తమకు న్యాయం చేయాలంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిపక్షాల మాయలో పడొద్దు: మంత్రి హరీశ్రావు
హుస్నాబాద్ రైతులకు నీళ్లు రావొద్దని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్, భాజపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘‘నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ను అడ్డుకున్నారు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. 3,816 ఎకరాల భూసేకరణ పూర్తయింది, ఇంకా 84 ఎకరాలే మిగిలింది. గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15లక్షల పరిహారం ఇస్తున్నాం. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి 937 కుటుంబాలను గుర్తించాం. నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు’’ అని మంత్రి హరీశ్రావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత ఓటింగ్లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్ ఉపాధ్యాయ
విద్యా వంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.