Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలుకు సామర్లకోటలో హాల్టింగ్‌

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందే భారత్‌ రైలు గురువారం నుంచి సామర్ల కోట స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Published : 02 Aug 2023 22:41 IST

విశాఖపట్నం: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందే భారత్‌ రైలు గురువారం నుంచి సామర్ల కోట స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 7.15 గంటలకు సామర్లకోట స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరే వందేభారత్‌ రైలు రాత్రి 9.35 గంటలకు సామర్లకోట స్టేషన్‌కు చేరుకుంటుంది. కాకినాడ జిల్లా ప్రజలు, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సామర్లకోటలో వందే భారత్‌ హాల్టింగ్‌ సదుపాయం కల్పించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆ ప్రాంత ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని