IPL 2024 - Sanju Samson: సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ అంపైరింగ్పై విమర్శలు వస్తున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బౌండరీ లైన్ వద్ద దిల్లీ ఫీల్డర్ షై హోప్ క్యాచ్పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బౌండరీ లైన్ రోప్ను ఫీల్డర్ తాకినట్లు రిప్లేలో కనిపిస్తున్నా ఔట్గా ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేగాయి. తాజాగా ఈ ఘటనపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత నవ్జ్యోత్ సిద్ధూ స్పందించాడు. క్యాచ్ సమయంలో ఫీల్డర్ రెండుసార్లు బౌండరీ రోప్ను తాకాడని వ్యాఖ్యానించాడు.
‘‘దిల్లీ విజయానికి ప్రధాన కారణం సంజూ శాంసన్ ఔట్ నిర్ణయం. క్యాచ్పై ఒక్కోరిది ఒక్కో అభిప్రాయం. అయితే సైడ్ యాంగిల్ నుంచి చూస్తే బౌండరీ రోప్ను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం లేదా? అనే అనుమానాలు వస్తాయి. ఒకవేళ సాంకేతికతను వాడినా పొరపాటు వచ్చి ఉండొచ్చు. పాలల్లో ఈగ పడటం చూసిన మిమ్మల్ని వాటిని తాగమని ఎవరైనా చెబితే ఎలా ఉంటుందో.. మ్యాచ్లో రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకసారి కాదు.. రెండుసార్లు ఫీల్డర్ బౌండరీ లైన్ను తాకినట్లు కనిపిస్తోంది. అయినా సరే, ఎవరైనా ఇది ఔట్ అని బలంగా వాదిస్తే మాత్రం.. తటస్థ వ్యక్తిగా నేను కూడా కోహ్లీ నోబాల్ వివాదంపై మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి, నిబంధనలు ఎలా ఉన్నా.. మన కళ్లు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆధారాలు బలంగా ఉన్నప్పుడు వాటిని నమ్మాలి. అయితే, అంపైర్ కావాలనే ఇలా చేశాడని అనలేం. గేమ్లో ఇవన్నీ సహజమే. ఎవరినీ తప్పు బట్టలేం. అయితే, మ్యాచ్ స్వరూపాన్ని మాత్రం మార్చేసిందని చెప్పగలను’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.
మరిన్ని కోణాల్లో చూస్తే బాగుండేది: కోలింగ్వుడ్
‘‘మైకెల్ గాఫ్ (థర్డ్ అంపైర్) నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతడికి మద్దతుగా ఉండాలి. అయితే, క్యాచ్కు సంబంధించి మరికొన్ని కోణాల్లో చూసి ఉంటే బాగుండేది. బౌండరీ లైన్కు చాలా దగ్గరగా ఉందనిపించింది. ఇలాంటి నిర్ణయాలు కీలక సమయంలో తీసుకుంటే మ్యాచ్పై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే, ఇంకాస్త సమయం తీసుకుని నిర్ణయం వెల్లడిస్తే ఇంత దుమారం ఉండేది కాదు. ఐపీఎల్లో ప్రతిదీ వేగంగా జరిగిపోవాలని నిర్వాహకులు అనుకొని ఉంటారు. అందులో భాగంగా అంపైర్లు త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పాల్ కోలింగ్వుడ్ తెలిపాడు.
దిల్లీ ఫ్రాంచైజీ స్పందన..
కీలకమైన సంజూ శాంసన్ వికెట్ను తీసుకోవడంతో మ్యాచ్ దిల్లీ వైపు మళ్లింది. చివరికి 20 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. శాంసన్ క్యాచ్ నిర్ణయం వివాదాస్పదం కావడంతో దిల్లీ ఫ్రాంచైజీ కూడా స్పందించింది. ‘షై హోప్ బంతిని పట్టుకున్నాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ ఫొటోను పోస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
ఐపీఎల్ 17వ సీజన్లో కీలక సమయంలో హైదరాబాద్కు అదృష్టం కలిసొచ్చింది. నేడు రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. -
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. -
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!