TS News: న్యాయం కోసం బైక్పై దిల్లీకి బయలుదేరిన యువకుడు!
న్యాయం చేయాలని కోరుతూ ప్రధానిని కలిసేందుకు ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దిల్లీకి బయలుదేరాడు.
ఇల్లందు: న్యాయం చేయాలని కోరుతూ ప్రధానిని కలిసేందుకు ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దిల్లీకి బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన సుందర్.. ఖమ్మం జిల్లా సింగరేణి పరిధిలోని ఉపరితల గని విస్తరణలో భాగంగా తమ భూములను కోల్పోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని సింగరేణి సంస్థను కోరుతూ గత ఐదేళ్లుగా పలు విధాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమందికి విన్నవించినా న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ ఇటీవల సుందర్ ఇల్లందులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుందర్ కుమారుడు సంజయ్.. ప్రధానిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై గత నెల 29న దిల్లీ బయలుదేరాడు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.