
Fuel Price Hike: 95 శాతం భారతీయులకు పెట్రోలే అవసరం లేదు.. యూపీ మంత్రి వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు కుదేలవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తర్ప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ‘ఇంధన ధరల పెంపు విషయానికొస్తే అసలు 95 శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే కార్లు వినియోగిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘2014కు ముందు, ప్రస్తుత ఇంధన ధరలను పోల్చుతున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం వచ్చాక పౌరుల తలసరి ఆదాయం కూడ రెండింతలయింది కదా!’ అని పేర్కొనడం గమనార్హం. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వేరే ఏ సమస్య లేనందునే దీనిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
‘తలసారి ఆదాయంతో పోల్చితే తక్కువే’
‘ప్రభుత్వం 100 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత డోసులు ఇచ్చింది. కొవిడ్ చికిత్స అందించింది. ఇంటింటికీ మందులు పంపిణీ చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర రంగాల్లో ఉచిత సేవలు అందిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ధరలు స్వల్ప మొత్తంలో మాత్రమే పెరిగాయ’ని తివారీ అన్నారు. తలసరి ఆదాయంతో పోల్చినట్లయితే.. ఇంధన ధరలు చాలా తక్కువేనని సమాధానం ఇచ్చారు. గతంలోనూ భాజపాకు చెందిన మంత్రులు, నాయకులు ఇంధన ధరల పెరుగుదలపై ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సైతం.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
-
India News
తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
Movies News
social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
-
Politics News
Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
-
World News
Bette Nash: 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్హోస్టెస్గా.. ఈ బామ్మ గిన్నిస్ రికార్డ్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా