ఆగస్టు 15 తరవాతే అక్కడ 4జీ సేవలు
ట్రయల్ ఆధారంగా జమ్ముకశ్మీర్లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
మొదట రెండు జిల్లాల్లోనే
దిల్లీ: జమ్ముకశ్మీర్లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో ఈ సడలింపునకు అనుమతి ఉండదని, ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. రెండు నెలల తరవాత ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను కట్టబెట్టే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీస్తూ చేసిన చట్టం కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని 4జీ ఇంటర్నెట్ సేవలను నిలివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఈ నిషేధం విధించి సంవత్సరం దాటిపోయింది.
కాగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇంటర్నెట్ మీద ఆంక్షలు కరోనావైరస్ చికిత్స, విద్య, వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం చూపడంలేదన్నారు. మొబైల్ ఫోన్లలో హైస్పీడ్ ఇంటర్నెట్ను పునరుద్ధరించే విధంగా ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాలని శుక్రవారం సుప్రీం కోర్టు జమ్ముకశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితమే కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం జరగడంతో ఆ అంశంపై సూచనలు తీసుకోవడానికి తమకు కొంచెం సమయం కావాలని అక్కడి ప్రభుత్వం సుప్రీంను విజ్ఞప్తి చేసింది. ఇటీవల మనోజ్ సిన్హా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.