చర్చలతో చైనా వైఖరిలో మార్పురాదు: అమెరికా
భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు....
అర్థం చేసుకోవాలని భారత్కు అగ్రరాజ్యం హితవు
వాషింగ్టన్: భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా.. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. భారత్ ఇకనైనా అర్థం చేసుకోవాలని హితవు పలికింది. భారత్-చైనా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశిస్తూ అగ్రరాజ్యం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) రాబర్ట్ ఓబ్రియెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా తైవాన్ విషయంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రాదేశిక దురాక్రమణకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు.
‘వన్ బెల్ట్ వన్ రోడ్’(ఓబీఓఆర్) ప్రాజెక్టు వెనుక ఉన్న చైనా దురుద్దేశాన్ని ఓబ్రియెన్ ఈ సందర్భంగా ఎండగట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన కంపెనీలు బలవంతంగా తమ నుంచి రుణాలు తీసుకునే పరిస్థితిని చైనా సృష్టిస్తుందని ఓబ్రియెన్ తెలిపారు. తిరిగి చైనా కంపెనీలు వాటిలో పనిచేసే కార్మికులకే ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మౌలిక సదుపాయాలు చైనాకు మాత్రమే లబ్ధి చేకూరుస్తాయన్నారు. దీంతో చైనా వద్ద అప్పులు చేసే దేశాలు దీర్ఘకాలంలో వాటి సార్వభౌమత్వాన్ని కోల్పోయే ప్రమాదం రావొచ్చని స్పష్టం చేశారు. చివరకు గత్యంతరం లేక సీసీపీ తీసుకునే దురుద్దేశపూరిత నిర్ణయాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
అలాగే ఇతర దేశాలకు చైనా అందిస్తున్న సాంకేతిక, రక్షణపరమైన సహాయం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఓబ్రియెన్ వివరించారు. ట్రంప్ సర్కార్ చైనాకు కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. హువావే పరికరాల కొనుగోలుపై విధించిన నిషేధాన్ని ఉటంకించారు. అదే బాటలో భారత్కు చెందిన జియో సైతం 5జీ సాంకేతికతలో హువావే పరికరాల్ని పూర్తిగా నిషేధించిందని గుర్తుచేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అక్కడి ప్రాంతీయ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భారత్తో ఏర్పడిన భాగస్వామ్యం 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో చర్చలు జరపడం వల్ల సీసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఇకనైనా గ్రహించాలని ఓబ్రియెన్ హితవు పలికారు. డ్రాగన్తో మెతక వైఖరి వల్ల ఉపయోగం శూన్యమని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.