చర్చలతో చైనా వైఖరిలో మార్పురాదు: అమెరికా
భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు....
అర్థం చేసుకోవాలని భారత్కు అగ్రరాజ్యం హితవు
వాషింగ్టన్: భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా.. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. భారత్ ఇకనైనా అర్థం చేసుకోవాలని హితవు పలికింది. భారత్-చైనా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశిస్తూ అగ్రరాజ్యం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) రాబర్ట్ ఓబ్రియెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా తైవాన్ విషయంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రాదేశిక దురాక్రమణకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు.
‘వన్ బెల్ట్ వన్ రోడ్’(ఓబీఓఆర్) ప్రాజెక్టు వెనుక ఉన్న చైనా దురుద్దేశాన్ని ఓబ్రియెన్ ఈ సందర్భంగా ఎండగట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన కంపెనీలు బలవంతంగా తమ నుంచి రుణాలు తీసుకునే పరిస్థితిని చైనా సృష్టిస్తుందని ఓబ్రియెన్ తెలిపారు. తిరిగి చైనా కంపెనీలు వాటిలో పనిచేసే కార్మికులకే ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మౌలిక సదుపాయాలు చైనాకు మాత్రమే లబ్ధి చేకూరుస్తాయన్నారు. దీంతో చైనా వద్ద అప్పులు చేసే దేశాలు దీర్ఘకాలంలో వాటి సార్వభౌమత్వాన్ని కోల్పోయే ప్రమాదం రావొచ్చని స్పష్టం చేశారు. చివరకు గత్యంతరం లేక సీసీపీ తీసుకునే దురుద్దేశపూరిత నిర్ణయాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
అలాగే ఇతర దేశాలకు చైనా అందిస్తున్న సాంకేతిక, రక్షణపరమైన సహాయం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఓబ్రియెన్ వివరించారు. ట్రంప్ సర్కార్ చైనాకు కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. హువావే పరికరాల కొనుగోలుపై విధించిన నిషేధాన్ని ఉటంకించారు. అదే బాటలో భారత్కు చెందిన జియో సైతం 5జీ సాంకేతికతలో హువావే పరికరాల్ని పూర్తిగా నిషేధించిందని గుర్తుచేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అక్కడి ప్రాంతీయ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భారత్తో ఏర్పడిన భాగస్వామ్యం 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో చర్చలు జరపడం వల్ల సీసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఇకనైనా గ్రహించాలని ఓబ్రియెన్ హితవు పలికారు. డ్రాగన్తో మెతక వైఖరి వల్ల ఉపయోగం శూన్యమని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎన్టీఏ కొట్టిపారేసింది. -
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ