భారత్‌లో ప్రతి కోటి టెస్ట్‌లకు ఎన్ని రోజులు పట్టింది?

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ 49,715 కొత్త కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. పండగ సీజన్‌, చలికాలం కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్రం.. ......

Published : 21 Nov 2020 16:03 IST

13కోట్లు దాటిన కొవిడ్‌ పరీక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ 49,715 కొత్త కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. పండగ సీజన్‌, చలికాలం కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్రం.. అందుకనుగుణంగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీగా టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని తాజాగా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారిని గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తోంది. దీంతో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు సగటున 10లక్షల పరీక్షలు చేస్తున్న అధికారులు.. గడిచిన 24గంటల్లోనే 10,66,022 టెస్ట్‌లు చేసినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి.

ఈ 29 రోజుల్లోనే 3కోట్లకు పైగా టెస్ట్‌లు!
కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి జులై 7 వరకు కేవలం కోటి శాంపిల్స్‌ మాత్రమే పరీక్షించగా.. జులై 7 నుంచి ఆగస్టు 3వరకు మరో కోటి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత టెస్ట్‌ల ప్రక్రియను మరింత వేగవంతం చేసిన ఐసీఎంఆర్‌.. ఆగస్టు 17 నాటికి 3కోట్లు, ఆగస్టు 29 నాటికి 4కోట్లు, సెప్టెంబర్‌ 8 నాటికి 5కోట్లు, సెప్టెంబర్‌ 17 నాటికి 6 కోట్లు, సెప్టెంబర్‌ 26 నాటికి 7కోట్లు, అక్టోబర్‌ 6నాటికి 8కోట్లు, అక్టోబర్‌ 14 నాటికి 9కోట్లు, అక్టోబర్‌ 23 నాటికి 10 కోట్ల మార్కును దాటింది. అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 21 వరకు 29 రోజుల్లో మరో 3 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 13,06,57,808 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని