భారత్లో ప్రతి కోటి టెస్ట్లకు ఎన్ని రోజులు పట్టింది?
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ 49,715 కొత్త కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. పండగ సీజన్, చలికాలం కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్రం.. ......
13కోట్లు దాటిన కొవిడ్ పరీక్షలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ 49,715 కొత్త కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. పండగ సీజన్, చలికాలం కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్రం.. అందుకనుగుణంగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీగా టెస్ట్ల సంఖ్యను పెంచాలని తాజాగా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడినవారిని గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తోంది. దీంతో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు సగటున 10లక్షల పరీక్షలు చేస్తున్న అధికారులు.. గడిచిన 24గంటల్లోనే 10,66,022 టెస్ట్లు చేసినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి.
ఈ 29 రోజుల్లోనే 3కోట్లకు పైగా టెస్ట్లు!
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి జులై 7 వరకు కేవలం కోటి శాంపిల్స్ మాత్రమే పరీక్షించగా.. జులై 7 నుంచి ఆగస్టు 3వరకు మరో కోటి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత టెస్ట్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసిన ఐసీఎంఆర్.. ఆగస్టు 17 నాటికి 3కోట్లు, ఆగస్టు 29 నాటికి 4కోట్లు, సెప్టెంబర్ 8 నాటికి 5కోట్లు, సెప్టెంబర్ 17 నాటికి 6 కోట్లు, సెప్టెంబర్ 26 నాటికి 7కోట్లు, అక్టోబర్ 6నాటికి 8కోట్లు, అక్టోబర్ 14 నాటికి 9కోట్లు, అక్టోబర్ 23 నాటికి 10 కోట్ల మార్కును దాటింది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు 29 రోజుల్లో మరో 3 కోట్ల శాంపిల్స్ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 13,06,57,808 శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.