భారత్లో కరోనా@మరణాల గ్రాఫ్ తగ్గుతోందిలా..
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 53,601 పాజిటివ్ .....
దిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 47,746 మంది కోలుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారి మరణాల రేటు 2శాతం కంటే తక్కువగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. జూన్ మాసంలో 3.3.శాతంగా ఉన్న మరణాల రేటు.. ప్రస్తుతం 1.99%కి పడిపోయిందని తెలిపారు. దేశంలో కొవిడ్ పరిస్థితి, 10 రాష్ట్రాల్లో కరోనాపై సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తదితర అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి మిలియన్ జనాభాకు 18320 పరీక్షలు చేస్తున్నట్టు రాజేశ్ భూషణ్ తెలిపారు. జాతీయ సగటు కంటే 24రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి మిలియన్ జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య మెరుగ్గా ఉందన్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 15,83,489 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. ఆగస్టు 10న దేశంలోనే అత్యధికంగా 54,859మంది రికవరీ అయ్యారనీ.. ఇప్పటివరకు ఇదే రికార్డు అని గుర్తు చేసుకున్నారు. రికవరీ రేటు, యాక్టివ్ కేసుల మధ్య వ్యత్యాసం పెరుగుతోందన్న ఆయన.. క్లినికల్ మేనేజ్మెంట్ సమర్థంగా అమలుచేయడం వల్లే దేశంలో రికవరీ రేటు దాదాపు 70శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా రోగులకు సకాలంలో చికిత్స అందించిన ఫలితంగానే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 1.99శాతంగా ఉన్నట్టు చెప్పారు.
కరోనాపై తొలి వ్యాక్సిన్ను రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాజేశ్ భూషణ్ స్పందించారు. వ్యాక్సిన్ సంబంధిత వ్యవహారాల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆ బృందం రేపు సమావేశం కానుందని చెప్పారు. వ్యాక్సిన్ పొందేందుకు రష్యాతో కేంద్రం ఒప్పందం ఏదైనా కుదుర్చుకోవాలని యోచిస్తోందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా స్పందించారు. 10 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మోదీ.. బిహార్, గుజరాత్, యూపీ, పశ్చిమబెంగాల్, తెలంగాణలలో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందువల్ల టెస్టులు పెంచుకోవాలని సూచించారని చెప్పారు.
2.5కోట్లకు పైగా పరీక్షలు..
దేశంలో కరోనా టెస్టింగ్ సామర్థ్యం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నెల 8న ఒక్కరోజే అత్యధికంగా 7,19,361 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మాత్రం 6,98,290 శాంపిల్స్ పరీక్షించామనీ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,52,81,848 టెస్టులు నిర్వహించినట్టు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్