Covid: టెలిమెడిసిన్ సేవలు విస్తృతం చేయండి
క్షేత్రస్థాయిలో కొవిడ్-19 పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశవ్యాప్తంగా
వైద్యులకు ప్రధాని మోదీ పిలుపు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషణ
ఈనాడు, దిల్లీ: క్షేత్రస్థాయిలో కొవిడ్-19 పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. టెలిమెడిసిన్ సేవలను విస్తృతం చేసి, ఇంట్లో ఏకాంతంగా ఉన్న రోగులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది చూపుతున్న పోరాట పటిమను ప్రశంసించారు. దేశమంతా వారికి రుణపడి ఉంటుందన్నారు. ‘‘రికార్డు సమయంలో పరీక్షలు నిర్వహించడం, మందుల సరఫరా, కొత్త మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ వస్తున్నాం. మానవ వనరులను పెంచడానికి కొవిడ్ వైద్యసేవల కోసం ఎంబీబీఎస్ విద్యార్థులను, గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటూ వైద్య ఆరోగ్య వ్యవస్థను విస్తరించాం. ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలిదశలోనే వ్యాక్సిన్ వేయడం రెండో ఉద్ధృతిలో కలిసివస్తోంది. 90% మంది వైద్యఆరోగ్య సిబ్బంది ఇప్పటికే మొదటి డోసు తీసుకున్నారు. వైద్యులకు వ్యాక్సిన్ భద్రత కల్పించింది. ఆసుపత్రుల రోజువారీ కార్యకలాపాల్లో ఆక్సిజన్ ఆడిటింగ్నూ చేర్చాలి. పెద్దసంఖ్యలో రోగులు ఇంట్లోనే ఏకాంతంలో ఉన్నందున వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి వైద్యులు వివరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో టెలిమెడిసిన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సేవలను గ్రామాలకూ విస్తరించాలి. డాక్టర్లు బృందాలుగా ఏర్పడి.. కొవిడ్ చికిత్స విధానంపై ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకు, ఎంబీబీఎస్ ఇంటర్న్స్కీ శిక్షణ ఇవ్వాలి. వారిద్వారా మండల, జిల్లా స్థాయిల్లో టెలిమెడిసిన్ సేవలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు విస్తృత చర్యలు తీసుకోవాలి. దాని గురించి రోగులకు అవగాహన కల్పించాలి. మానసిక, శారీరక జాగ్రత్తల గురించీ చెప్పాలి. ఈ వైరస్పై దీర్ఘకాలం పాటు నిరంతర పోరాటం చేయడం వల్ల వైద్యసిబ్బందిపై మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే వారిపట్ల ప్రజలకున్న అపార నమ్మకమే పోరాట శక్తినిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యసిబ్బందికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినందుకు డాక్టర్లు ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ తొలి ఉద్ధృతి నుంచి తాము సమాయత్తమైన తీరు, రెండో ఉద్ధృతిలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వారు ప్రధానికి వివరించారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను తెలియజేశారు.
క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మాటామంతి
కరోనా పీడిత 46 జిల్లాల ఎంపిక
దిల్లీ: దేశంలో కొవిడ్ -19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు రాష్ట్రాలు, జిల్లాల క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడనున్నట్లు ఆయన కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై సాగిస్తున్న పోరుకు సంబంధించి ఆయా అధికారులు వారి అనుభవాలు, సూచనలు, సిఫార్సులు ప్రధానికి చెబుతారు. దేశంలోని మిగతా ప్రాంతాలకు స్ఫూర్తి కలిగించేలా అధికారుల కృషితో ఆయా సమస్యలను పరిష్కరించిన విజయగాథలు కూడా ప్రధానితో పంచుకోవచ్చని పీఎంవో పేర్కొంది. కర్ణాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ప్రదేశ్, దిల్లీ ప్రాంతాల సిబ్బంది ఈ భేటీలో పాల్గొనే అవకాశముంది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాలకు చెందిన జిల్లా న్యాయమూర్తులు కూడా ఇందులో పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. మే 20న పది రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఇదేవిధంగా ప్రధాని మరోమారు మాట్లాడనున్నారు. కరోనాపై పోరులో క్షేత్రస్థాయి అధికారులు కీలకమని పీఎంవో వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు