తమిళనాట 3వేలు దాటిన కరోనా మరణాలు

తమిళనాడును కరోనా వణికిస్తోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో.....

Published : 22 Jul 2020 21:26 IST

రికార్డు స్థాయిలో కేసులు నమోదు 

చెన్నై: తమిళనాడును కరోనా వణికిస్తోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి.  తాజాగా బుధవారం ఏకంగా 5849 పాజిటివ్‌ కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,492కి పెరిగింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,31,583 మంది కోలుకోగా.. మరణాల సంఖ్య  3144గా నమోదైంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 51,765 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 

రికవరీ రేటు 70.12%

గడిచిన24 గంటల్లో 60,112 శాంపిల్స్‌‌ పరీక్షించగా.. 5849 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే 1171 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 4910మంది రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,15,147 శాంపిల్స్‌ను పరీక్షించారు. తమిళనాట రికవరీ రేటు 70.12శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని