ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌ సైతం అమరుడయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం-శనివారం మధ్యరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది..........

Published : 29 Aug 2020 10:29 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌ సైతం అమరుడయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలోని జదూర ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో సాయుధ బలగాలతో కలిసి జమ్మూ కశ్మీర్‌ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో వీరి కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియలేదు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని