టీకా వేయించుకున్న సీరమ్ అధినేత
కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం మొదలైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న
పుణె: కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం మొదలైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకా అందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా కూడా నేడు టీకా తీసుకున్నారు.
ఈ విషయాన్ని అదర్ ట్విటర్లో వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ, యావత్ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ చారిత్రక ఘట్టంలో ‘కొవిషీల్డ్’ కూడా భాగస్వామికావడం నాకు మరింత గర్వంగా ఉంది. టీకా భద్రత, సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు ఆరోగ్య కార్యకర్తలతో పాటు నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నా’ అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వీడియోను ఆయన పంచుకున్నారు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ‘కొవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీకా పంపిణీ కోసం కేంద్రం.. సీరం సంస్థ నుంచి 1.1 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది. ఇక మరో సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగానికి కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేయనున్నారు. టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. విదేశాలతో పోలిస్తే భారత్లో వ్యాక్సిన్ ధరలు చౌకగా ఉన్నాయని తెలిపారు.
ఇవీ చదవండి..
అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.