Vijaypat Singhania: ‘ఆ ఆత్మకథ విక్రయాలను వెంటనే నిలిపేయండి’
పారిశ్రామికవేత్త, రేమాండ్ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా ఆత్మకథ 'ఎన్ ఇన్కంప్లీట్ లైఫ్' అమ్మకాలు, సర్క్యులేషన్, డిస్ట్రిబ్యూషన్పై బాంబే హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ పుస్తకం విషయంలో మొదటినుంచి విజయ్పత్కు.. విడిపోయిన...
బాంబే హైకోర్టు ఆదేశాలు
ముంబయి: పారిశ్రామికవేత్త, రేమాండ్ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా ఆత్మకథ 'ఎన్ ఇన్కంప్లీట్ లైఫ్' అమ్మకాలు, సర్క్యులేషన్, డిస్ట్రిబ్యూషన్పై బాంబే హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ పుస్తకం విషయంలో మొదటినుంచి విజయ్పత్కు.. విడిపోయిన ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియాతోపాటు రేమండ్ కంపెనీతో న్యాయవివాదం నెలకొంది. పుస్తకంలో పేర్కొన్న విషయాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, గోప్యత హక్కును ఉల్లంఘించడంతోపాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఇతర రహస్య సమాచారాన్ని చర్చించారని రేమండ్ లిమిటెడ్తోపాటు దాని ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ ఆత్మకథపై నిషేధం విధించాలంటూ.. 2019లోనూ ఠాణె జిల్లా సెషన్స్ కోర్టు, ముంబయిలోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఠాణె జిల్లా సెషన్స్ కోర్టు.. అదే ఏడాది ఏప్రిల్లో పుస్తకం విడుదలపై నిషేధం విధించింది. అయినా.. విజయపత్ సింఘానియా, ప్రచురణకర్తలు కోర్టు ఉత్తర్వును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ ఇటీవల పుస్తకాన్ని విడుదల చేశారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ గురువారం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్.. పుస్తకం తదుపరి విక్రయాలు, పంపిణీ, సర్క్యులేషన్ను నిలుపుదల విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులతో వచ్చిన వివాదం వల్ల విజయ్పత్ వారసత్వ గృహాన్ని, ఇతర ఆస్తిపాస్తులనూ కోల్పోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.