Sonia Gandhi: మోదీ బడ్జెట్.. పేదలపై నిశ్శబ్ద పిడుగు..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget) పేదలపై నిశ్శబ్ద పిడుగువంటిదని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల విపరీతంగా పెరుగుతోందని.. కానీ, ప్రధాని మోదీ, ఆయన పరివారం మాత్రం విశ్వగురు, అమృత్కాల్ అంటూ నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.
దిల్లీ: ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Budget 2023) పేదలపై మోదీ ప్రభుత్వం చేసిన నిశ్శబ్ద దాడి అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. యూపీఏ హయాంలో చేసిన హక్కుల ఆధారిత చట్టాలను అన్నింటినీ ఈ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. మరోవైపు తమ ప్రియమైన వ్యాపారవేత్తలపై ఆర్థిక కుంభకోణం ఆరోపణలు వస్తున్నప్పటికీ.. విశ్వగురు, అమృత్కాల్ అంటూ ప్రధాని మోదీ (Narendra Modi), ఆయన మంత్రులు మాత్రం నినాదాలు చేస్తూ పొంగిపోతున్నారంటూ ఓ జాతీయ వార్తా పత్రికకు రాసిన ప్రత్యేక వ్యాసంలో సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.
పేదలు, మధ్యతరగతి ఖర్చుతో కొందరి మిత్రుల ప్రయోజనం కోసం రూపొందిస్తున్న విధానాలు క్రమంగా దెబ్బతీస్తున్నాయి. నోట్ల రద్దు నుంచి మొదలు అత్యంత చెత్తగా రూపొందించిన జీఎస్టీ చిన్న వ్యాపారులను ఎంతో వేధిస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలు విఫలం కావడంతోపాటు వ్యవసాయం కూడా అలక్ష్యానికి గురయ్యింది. ప్రైవేటీకరణ పేరుతో జాతీయ సంపదను కొందరు ప్రైవేటు వ్యక్తులకు చౌకగా కట్టబెడుతున్నారు. దీంతో నిరుద్యోగం పెరగడంతోపాటు ఎస్సీ, ఎస్టీల పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.
‘కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎల్ఐసీ, ఎస్బీఐలలో పొదుపు చేసుకున్న నగదును సన్నిహితుల కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. ప్రధానమంత్రికి నచ్చిన, ఆయన ప్రియ మిత్రుల ఆర్థిక కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ.. ప్రధాని, ఆయన మంత్రులు మాత్రం విశ్వగురు, అమృత్కాల్ అంటూ నినాదాలు చేస్తున్నారు’ అంటూ కేంద్ర ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపాదన తగ్గిపోవడం వంటి వాటితో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. 2004-14 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలపై పిడుగు అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్