పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది.
సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు అనుమతి
అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. ఆమె ప్రభుత్వం చేపట్టిన 25వేల మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు వెలువరించింది. నియామకాల కుంభకోణంపై దర్యాప్తును కొనసాగించుకోవచ్చని సీబీఐకి తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులను ప్రశ్నించవచ్చని పేర్కొంది. అయితే, దర్యాప్తు సమయంలో నిందితుల అరెస్టు వంటి చర్యలకు దిగవద్దని సూచించింది. ప్రభుత్వ నియామకాలు అక్రమమని తేలితే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇప్పటి వరకు వారు పొందిన జీత భత్యాలను తిరిగి చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్లోని పాఠశాలల్లో 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని నియమించడానికి నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ను వ్యవస్థీకృత మోసంగా ధర్మాసనం అభివర్ణించింది. సంబంధిత సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ సమాచారంతో కూడిన డిజిటల్ రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర అధికారులదేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు అరుదుగా ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి కుంభకోణాలు జరగడం శోచనీయమని, ప్రజల విశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాల ఉద్యోగాల నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణను జులై 16న ముగించనున్నట్లు తెలుపుతూ ఆ రోజుకు వాయిదా వేసింది.
నియామకాల రద్దు నిలిచిపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘చాలా ఆనందంగా ఉంది. మానసికంగా ఉపశమనం లభించింది’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మమత పోస్ట్ చేశారు. ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
నిరపరాధుల పేర్లను నేరచరిత్ర రికార్డుల్లో చేర్చకండి
వ్యక్తుల నేర చరిత్రను నమోదు చేసే ‘హిస్టరీ షీట్’ నిర్వహణలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. నిర్దోషులు, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు, నిరక్షరాస్యులను అన్యాయంగా, పక్షపాతంతో ఆ జాబితాలో చేర్చవద్దని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వర్గాల ప్రజల పట్ల ఉండే చులకన భావనతోనూ వారిని అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం వివిధ అధ్యయనాల ద్వారా వెలుగు చూశాయని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. హిస్టరీ షీట్/రౌడ్ షీట్ రికార్డులను యాంత్రికంగా నిర్వహించడం ఏమాత్రం తగదని హెచ్చరించింది. బ్రిటిష్ వలస పాలనా కాలంలో అనుసరించినట్లుగానే కొన్ని విముక్త జాతులకు సంబంధించిన వ్యక్తుల పేర్లను పోలీస్ డైరీలలో నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయని ధర్మాసనం తెలిపింది. పోలీసులు ఆయా వర్గాల ప్రజల పట్ల అన్యాయంగా, పక్షపాత ధోరణితో వేధింపులకు పాల్పడకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలను వెంటనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించాలని కోర్టు రిజిస్ట్రీకి సూచించింది. తాను దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తినంటూ దిల్లీ పోలీసులు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం హిస్టరీ షీట్ అంశమై ఈ ఆదేశాలు జారీ చేసింది. హిస్టరీ/రౌడీ షీట్లలో నమోదైన నిర్దోషులు, మైనర్ల వివరాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
తన భార్య మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ వాపోయారు. -
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గేను ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ తాజాగా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సీఐఎస్ఎఫ్’ నిర్వహించనుంది. 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. -
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM