vaccine: డెల్టా రకంపై కొవిషీల్డ్, కొవాగ్జిన్ సమర్థవంతం!
దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా విభజిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే పరిగణిస్తున్నామని.. దాని తీవ్రతను బట్టి రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక తాజాగా జరిపిన అధ్యయనంలో డెల్టా రకంపై స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అత్యధిక ప్రభావశీలత చూపించిందని ఆ వ్యాక్సిన్ను తయారుచేసిన గమలేయా ఇన్స్టిట్యూట్ ప్రకటించింది.
80దేశాల్లో డెల్టా వేరియంట్..
భారత్తో పాటు దాదాపు 80దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ప్రస్తుతం కొత్తగా వెలుగు చూసిన డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాతో పాటు భారత్లో బయటపడిందని తెలిపారు. ఇప్పటివరకు భారత్లో 45వేల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా.. 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించామన్నారు. కొవిడ్ వేరియంట్లను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన INSACOG ఆధ్వర్యంలో ఉన్న 28 ప్రయోగశాలల ద్వారా వీటి తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు.
3 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
ఇప్పటివరకు దేశంలో మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, జల్గావ్, ముంబయిలో వెలుగులోకి రాగా.. కేరళలో మూడు కేసులు, మధ్యప్రదేశ్లో ఒక కేసు బయటపడినట్టు తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేయడంతో పాటు టెస్టింగ్, ట్రాకింగ్ను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే, డెల్టా ప్లస్ వేరియంట్తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం