Everestపై కరోనా.. అప్రమత్తమైన చైనా
ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను కరోనా వైరస్ తాకిన వేళ చైనా అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మళ్లీ తమవైపు రాకుండా జాగ్రత్తలు వహిస్తోంది. నేపాల్ నుంచి ఎవరెస్ట్ను అధిరోహించే పర్వతారోహకులు తమవైపు రాకుండా ఒక ప్రత్యేక గీతను గీస్తోంది....
ప్రత్యేక గీత గీస్తోన్న డ్రాగన్ దేశం
బీజింగ్: ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను కరోనా వైరస్ తాకిన వేళ చైనా అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మళ్లీ తమవైపు రాకుండా జాగ్రత్తలు వహిస్తోంది. నేపాల్ నుంచి ఎవరెస్ట్ను అధిరోహించే పర్వతారోహకులు తమవైపు రాకుండా ఒక ప్రత్యేక గీతను గీస్తోంది. నేపాల్ నుంచి ఎవరెస్ట్ ఎక్కేవారు.. టిబెట్ నుంచి ఆ పర్వతాన్ని అధిరోహించేవారు కలవకుండా కఠిన నిబంధనలు పాటిస్తోంది. ఎవరెస్ట్ ఉత్తరవాలు తమ దేశంలో ఉండటంతో చైనా ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటివరకు నేపాల్లోని ఎవరెస్ట్ బేస్క్యాంపులో ఉన్న 30 మంది పర్వతారోహకులు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ఇరువైపుల నుంచి ఎక్కే పర్వతారోహకులు కలవకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. ఎవరెస్ట్పై ప్రత్యేకంగా ఓ లైన్ను ఏర్పాటుచేస్తోంది. తమ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినవాళ్లు ఆ లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర, దక్షిణ వైపు నుంచి ఎక్కే క్లైంబర్స్ కలవకుండా అత్యంత కఠినమైన వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు టిబెట్ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి 21 మందికి చైనా అనుమతిచ్చింది. ఏప్రిల్ నుంచే వీళ్లంతా టిబెట్లో క్వారంటైన్లో ఉన్నారు. తమ వైపు ఉన్న ఎవరెస్ట్ సమీపంలో వైరస్ సోకకుండా సాధారణ పర్యాటకులను డ్రాగన్ ఇప్పటికే నిషేధించింది. గతేడాది నుంచి కరోనా కారణంగా విదేశీ క్లైంబర్స్ను కూడా అనుమతించడంలేదు. నేపాల్ కూడా గతేడాది ఇలాగే చేసినా పర్యాటకాన్ని మళ్లీ గాడిలో పడేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టులను అనుమతించింది. ఎవరెస్ట్ ఎక్కడానికి అనుమతి కోసమే నేపాల్ ప్రభుత్వానికి 11 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత తమ సాహసయాత్ర పూర్తి చేసేందుకు మరో 40 వేల డాలర్లు ఖర్చవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం