ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా దేశంలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రి.........

Published : 27 Feb 2021 20:50 IST

అహ్మదాబాద్‌: దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా దేశంలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లలో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ నాలుగు నగరాల్లో నవంబర్‌ నుంచి నిరవధిక కర్ఫ్యూ అయిదు దఫాలుగా పొడిగించారు. ఈ నెల 28తో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతిలో 8 వరకు లాక్‌డౌన్
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. అమరావతిలో విధించిన లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అకోలా, అకోట్‌, ముర్జీత్‌పుర్‌లలో సైతం ప్రజలు తప్పనిసరిగా లాక్‌డౌన్‌ నియమాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇక్కడ మార్చి 5, 6 తేదీల్లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని