Car Parking: కారు పార్కింగ్ కోసం.. సీఎం కాన్వాయ్నే అడ్డుకున్నాడు
కారు పార్కింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో ఓ పెద్దాయన.. సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నాడు. సీఎం కోసం వచ్చే వారితో ఈ ప్రాంతంలో పార్కింగ్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశాడు.
బెంగళూరు: మెట్రో నగరాల్లో కారు పార్కింగ్ (Car Parking) బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లినప్పుడు కారు పార్క్ చేసేందుకు స్థలం దొరకడం పెద్ద సవాల్. ఇక వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాల్లో.. వారిని చూసేందుకు వచ్చే వారితో ఆ ప్రాంతం నిత్యం బిజీగా ఉంటుంది. పలు సందర్భాల్లో చుట్టుపక్కల నివసించే వారికి సైతం ఇబ్బందులు తప్పవు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురై.. విసిగిపోయిన ఓ పెద్దాయన ఏకంగా సీఎం కాన్వాయ్నే అడ్డుకున్నాడు. మీ కోసం వచ్చే వారితో ఈ ప్రాంతంలో పార్కింగ్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీఎంకు ఫిర్యాదు చేశాడు.
బెంగళూరు (Bengaluru)లో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇంటికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సీఎం ఇంటి నుంచి వస్తున్న కాన్వాయ్ను అతడు అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే, తాను సీఎంతో మాట్లాడాలని కోరడంతో.. అధికారులు అనుమతించారు. సీఎం ఉన్న కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘‘మిమ్మల్ని చూసేందుకు వచ్చే వారు వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల.. నేను, నా కుటుంబసభ్యులు మా కార్లను బయటికి తీయలేకపోతున్నాం. ఈ ప్రాంతంలో మాకు కారు పార్కింగ్ కోసం స్థలం దొరకడంలేదు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇకపై మేం దీన్ని భరించలేం’’ అని చెప్పడంతో.. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
బలవంతంగా రాజీనామా చేయించారు.. కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ ఉద్యోగి
కర్ణాటక సీఎంగా ఎన్నికైన తర్వాత సిద్ధరామయ్య.. తన అధికారిక నివాసానికి మారలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన నివాసం ఉంటున్న ఇంటినే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సీఎం అధికారిక బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. యడియూరప్ప త్వరలోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తారని, ఆగస్టులో సిద్ధరామయ్య అందులోకి మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ